తాండూరు మైనార్టీ ప్రజలకు ఇచ్చిన హామిని నెరవేర్చుకుని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పెద్ద మనసు చాటుకున్నారని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. సోమవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తాండూరు నియోజికవర్గంలో మైనారిటీ సంక్షేమం కోసం 7. 31 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మైనార్టీలకు నిధుల కేటాయింపు చేయడం పలువురు సంతోషం వ్యక్తం చేశారు.