ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికాలో కాల్పులు తెలుగమ్మాయి మృతి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 01:13 PM

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు అమ్మాయి మృతి చెందింది. టెక్సాస్‌లోని డల్లాస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అలెన్ ప్రీమియర్ షాపింగ్ కాంప్లెక్స్‌లో శనివారం మధ్యాహ్నం 3: 30 గంటలకు ఒక దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ దుర్ఘటన లో 8 మంది మృతి చెందారు. ఈ కాల్పుల్లో తాటికొండ ఐశ్వర్య కూడా మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ఐశ్వర్య తండ్రి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరి స్వస్థలం నల్గొండ జిల్లా , మిర్యాలగూడ అని సమాచారం.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com