కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజేషన్ పూర్తి అయింది. ఈ మేరకు వారికి వ్యక్తిగతంగా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, పలు ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న 3,096 మంది, డిగ్రీ కాలేజీల్లో 280 మంది, పాలిటెక్నిక్ కాలేజీల్లోని 520 మంది లెక్చరర్లకు రెగ్యులరైజేషన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.