శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటించిన "దసరా" సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జులై 28, 2024న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో ప్రదర్శించబడుతుందని సమాచారం. ఈ సినిమాలో నాని సరసన కీర్తి సురేష్ జోడిగా నటిస్తుంది. యాక్షన్ డ్రామా ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో ధీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో, పూర్ణ, ఝాన్సీ, సాయి కుమార్, సముద్రఖని, జరీనా వహాబ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.