ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మెయ్యజగన్' తమిళనాడు రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 20, 2024, 03:26 PM

కోలీవుడ్ నటుడు కార్తీ తన 27వ సినిమాని C. ప్రేమ్ కుమార్‌తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. మెయ్యజగన్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండస్ట్రీలో భారీ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి అభిమానులు మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తమిళనాడు రైట్స్ ని శక్తీ ఫిలిం ఫ్యాక్టరీ సొంతం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం కుంభకోణం మరియు శివగంగైలోని అద్భుతమైన ప్రదేశాలలో చిత్రీకరించబడింది. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com