షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వంలో యువ నటుడు సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి అన్ని చోట్లా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా మార్చి 17న జీ5 లో డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో టీనా శిల్పరాజ్ కథానాయికగా నటించింది. ఆశిష్ విద్యార్థి, రోహిణి మొల్లేటి, గోపరాజు, గౌరి ప్రియారెడ్డి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. చై బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిలింస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.