ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఆదిపురుష' వివాదాలకు దూరం కావడం లేదు. ఈ సినిమాలో రాముడు, హనుమంతుడు, రావణుడు తదితరుల పాత్రలకు సంబంధించిన 'అభ్యంతరకర కంటెంట్'ని తొలగించాలని కోరుతూ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హిందూసేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా ఈ పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో రాముడు, ఇతర పాత్రలను అనుచితంగా చిత్రీకరించారని, హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీశారని పేర్కొన్నారు.