టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, ఎర్రచందనం నేపథ్యంలో తెరకెక్కించిన సినిమా పుష్ప. అల్లుఅర్జున్, రష్మిక మండన్న హీరోహీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమా విడుదలై చాలా కాలం గడుస్తున్నా జనాలలో పుష్ప మ్యానియా ఇప్పుడప్పుడే పోయేటట్లు కనిపించటం లేదు. బాలీవుడ్లో ఐతే, పుష్ప ఒక మ్యానియా అయిపోయింది. ఎక్కడ చూసినా శ్రీవల్లి, తగ్గేదేలే, ఏయ్ బిడ్డా అంటూ పుష్ప సినిమాలోని పాటలే. ఇప్పటికీ సోషల్ మీడియా లో పుష్ప క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేస్తూ, మ్యానరిజమ్స్ తో రీల్స్ చేస్తూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సామాన్య జనానికి పోటీగా పలువురు సినీ, క్రికెట్ ప్రముఖులు కూడా "పుష్ప" ను అనుకరిస్తుండటం విశేషం.
తాజాగా బాలీవుడ్ బుల్లితెర పై ఒక ప్రముఖ డాన్స్ షోలో సామీ పాటకు ఇద్దరు చిన్నపిల్లలు వేసిన డాన్స్ అందరిని అబ్బురపరుస్తుంది. జూనియర్ పుష్ప, శ్రీవల్లి జంటగా ఈ పిల్లలు వేసిన డాన్స్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.