చాన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కమల్ హాసన్ కు "విక్రమ్" సినిమా బ్లాక్ బస్టర్ హిట్ నిచ్చింది. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కమల్ తో పాటు విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, హీరో సూర్య నటించారు. రెండు వారాల క్రితం విడుదలైన ఈ సినిమాకు ధియేటర్ల వద్ద ఇంకా రష్ తగ్గలేదు. తమిళం, తెలుగు, హిందీ బాక్సాఫీస్ ల వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది. అన్ని భాషల్లో కలిపి విక్రమ్ సినిమాకు ఇప్పటివరకు రూ. 300 కోట్లు వచ్చాయని తెలుస్తుంది. ఈ సినిమాను రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ సొంతంగా నిర్మించారు.
విక్రమ్ తెలుగు రైట్స్ ను నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సినిమా రెండు వారాల్లో రూ. 13.56 షేరును తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ను బట్టి విక్రమ్ మూవీ నైజాం నుండి రూ. 5.55 కోట్లు, ఆంధ్రా నుండి రూ. 5.87 కోట్లు, సీడెడ్ నుండి రూ. 2.12 కోట్లను వసూలు చేసింది. దీంతో విక్రమ్ ను డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఇంకో వారం వరకు తెలుగులో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేవీ లేవు. దీంతో మూడో వారంలో కూడా విక్రమ్ సాలిడ్ ఫిగర్స్ ను రాబట్టే అవకాశం మెండుగా ఉంది.