నిర్మాతగా మోడరన్ క్లాసిక్ సినిమాలను తెరకెక్కించిన ఎమ్మెస్ రాజుగారు ప్రస్తుతం దర్శకుడిగా మారి, కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పెట్టి చేసిన సినిమా 7డేస్ 6నైట్స్. ఈ చిత్రం జూన్ 24న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ చేస్తూ ఎమ్మెస్ రాజు అండ్ టీం బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో భాగంగా ఆయన ఈటీవి ఛానెల్ లో, ఆలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా కార్యక్రమానికి హాజరై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ ఇమేజుండి పెద్ద హీరోల సినిమాల జోలికి వెళ్లానని ఖరాఖండిగా చెప్పేసి అందరిని షాక్ కు గురి చేసారు. గతంలో ఆయన నిర్మించిన పౌర్ణమి, ఖలేజా సినిమాల హీరోలు ప్రభాస్, మహేష్ బాబు వచ్చి అడిగిన వారితో సినిమా చెయ్యనని ఘాటుగా చెప్పారు. స్టార్ హీరోలను, వారి స్టార్ ఇమేజును దృష్టిలో పెట్టుకుని సినిమాను తీయడం కన్నా కధాకధనాలను నమ్మి సినిమాలను తీస్తే నిర్మాత పది కాలాల పాటు చల్లగా ఉంటాడని చెప్పుకొచ్చారు. ఉదయ్ కిరణ్ తో నిర్మించిన 'మనసంతా నువ్వే' సినిమా తీసుకొచ్చినన్ని లాభాలు మరే స్టార్ హీరో సినిమా కూడా తీసుకురాలేదని చెప్పారు.