తమిళ స్టార్ హీరో విజయ్కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఇక్కడా తన మార్కెట్ను పెంచుకునేందుకు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విజయ్ సరసన హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి గురువారం ట్విట్టర్లో కీలక అప్డేట్ వచ్చింది. 25 రోజుల ఫస్ట్ షెడ్యూల్ పూర్తైనట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. హీరో శ్రీకాంత్, ప్రభు, శరత్కుమార్, సంగీత వంటి భారీ తారాగణం ఈ చిత్రలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.