పరశురామ్ డైరెక్షన్లో సూపర్స్టార్ మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రం సర్కారువారిపాట. ఇందులో కీర్తి సురేష్ కధానాయిక. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం మే 12న విడుదలైంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషలలోనూ సబ్ టైటిల్స్ తో విడుదలైంది. అయితే, ఈ మూవీని హిందీలో కూడా విడుదల చెయ్యాల్సి ఉంది. అందుకు దర్శకధీరుడు రాజమౌళి అడ్డుపడ్డారని టాక్.
వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం సర్కారువారిపాట విడుదలైంది కాబట్టి మరి కొద్దిరోజుల్లో మహేష్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేస్తాడు. ఇక ఈ ఏడాదంతా మహేష్ ఈ మూవీ కోసమే పని చేస్తాడు కాబట్టి వచ్చే సంవత్సరం నుండి రాజమౌళి సినిమా ప్రారంభమవుతుంది. ఈ విషయంపై ఇప్పటికే రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ క్లారిటీ ఇచ్చేసారు. మహేష్- రాజమౌళి సినిమా లో రాబోయేది హై బడ్జెట్ పాన్ ఇండియా సినిమా. ఈ సినిమాతో మహేష్ బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నాడు. తెలుగులో ఆయన చేసిన సినిమాలు హిందీ లో డబ్ అయినప్పటికీ ఇదే తొలిసారి డైరెక్ట్ గా థియేటర్లలో రిలీజయ్యే సినిమా. సో, మహేష్ కోసం జక్కన్న ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే SVP హిందీ రిలీజ్ ను అడ్డుకున్నాడని తెలుస్తోంది. ఎందుకంటే, ఒకవేళ బాలీవుడ్ లో ఈ మూవీ కాస్త అటు ఇటు అయినా ఆ ప్రభావం జక్కన్న సినిమాపై పడుతుందని భావించి మహేష్ చేత ఆ మూవీ హిందీ రిలీజ్ ను రాజమౌళి క్యాన్సిల్ చేయించాడని చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి. SVP హిందీలో రిలీజ్ కాకపోవడానికి కారణాలు ఏమైనప్పటికీ జక్కన్నను ఈ విషయంలో లాక్కురావటం వల్ల ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.