జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ సినిమా 'ఏక్ విలన్ రిటర్న్'. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. గురువారం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన పార్టీలో విలన్ గర్ల్స్ సందడి చేశారు. పటానీ, తారా పోటీ పడుతూ.. అందాలు ఆరబోశారు. 2014లో వచ్చిన 'ఏక్ విలన్ కు సీక్వెల్ గా తెరకెక్కింది. అయితే సీక్వెల్ లో కథ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ను టీసిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జులై 8న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.