టాలీవుడ్ విలక్షణ నటుడు రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సురేష్ బొబ్బిలి సంగీత దర్శకత్వం వహించిన ఈ మూవీ షూటింగ్ గతేడాదిలోనే పూర్తయింది. 1990లలో తెలంగాణ లో జరిగిన నక్సలైట్ల ఉద్యమం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది ఏప్రిల్లో విడుదలకావాల్సి ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా పలుమార్లు వాయిదా పడింది.
షూటింగ్ మొదలైనప్పటి నుండి ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ చిత్రబృందం మాత్రం ఈ సినిమా విడుదలపై ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు.
ఇటీవల నారప్ప,దృశ్యం 2 సినిమాలని డైరెక్ట్ ఓటిటిలో విడుదల చేసారు సురేష్ బాబు. ఇప్పుడు అదే తరహాలో రానా విరాటపర్వం కూడా డైరెక్ట్ ఓటిటి లో విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటిటి సంస్థ ఈ విషయమై చిత్రబృందం తో చర్చలు కూడా జరుపుతుందట. సుమారు 42కోట్లతో విరాటపర్వం ను ఓటిటిలో స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. ఇందుకు రానా తండ్రి సురేష్ బాబు ప్రధాన కారణం అని తెలియకనే తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.