ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెండో రోజు కలెక్టర్ల సమావేశం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jan 19, 2018, 10:40 AM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రెండవ రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొంటున్నారు. కీలక శాఖలపై కలెక్టర్లతో చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వృద్ధిలో దేశంలో అగ్రస్థానంలో ఉందని ముఖ్యమంత్రి  చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకూ కేంద్రం చేయూతనివ్వాలని ఆయన కోరారు. ఇప్పుడిప్పుడే కొద్దిగా కోలుకుంటున్నామని ఆయన అన్నారు. యుపిఎ ప్రభుత్వం చేసిన అన్యాయం వల్లనే ఆంధ్రప్రదేశ్‌కు దుస్థితి పట్టిందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రం ఎదిగే వరకూ కేంద్రం చేయూతనివ్వాల్సిందేనని, ఈ విషయంలో రాజీ లేదని, అవసరమైతే కోర్టుకు కూడా వెళతామని ఆయన చెప్పారు. విభజన గాయం నుంచి కోలుకుంటున్నామనీ, అయితే ఇంకా గాయం మానలేదని అన్నారు. కలెక్టర్ల సదస్సు రెండో రోజు ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రపాలకులు అన్యాయం చేశారనడం సరికాదన్నారు. 1995 కు ముందు తరువాత హైదరాబాద్ అభివృద్ధిని గమనిస్తే.. వాస్తవం బోధపడుతుందన్నారు. యూపీఏ నిర్వాకం వల్లే అడ్డగోలు విభజన జరిగి ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగిందని ఆయన అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com