జమ్మూకశ్మీర్ సరిహద్దులో మళ్లీ పాకిస్థాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడింది. పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు సాధారణ పౌరులు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఆర్ఎస్ పురా సెక్టార్లో ఈ ఘటన జరిగింది. సాంబా, కథువా సెక్టార్లోనూ పాక్ కాల్పులకు పాల్పడింది. అయితే పాక్ దళాలను బీఎస్ఎఫ్ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి.