వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 65వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది. కొద్దిసేపటి క్రితమే ప్రజాసంకల్పయాత్ర చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని సదాశివపురం చేరుకుంది. అంతకంటే ముందుగా ఏర్పేడు మండలం వికృతమాల గ్రామానికి చెందిన రామ్మూర్తి జగన్ ను కలిసి.. తన సమస్యను విన్నవించుకున్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన రామ్మూర్తి విమానాశ్రయ నిర్మాణం కోసం ఆయన భూమిని ప్రభుత్వం బలవంతంగా లాక్కొందని తెలిపాడు. దీంతో భూమి కోల్పోయిన ఆయనకు కనీసం సరైన పరిహారం కూడా ఇవ్వలేదని తెలిపారు. జగన్ స్పందించి మన ప్రభుత్వం వచ్చాక నీకు న్యాయం చేస్తానని జగన్ తెలిపారు.