ఉగ్రవాదాన్ని నియంత్రించాలంటే కొన్ని ఎంపిక చేసిన సామాజిక మాధ్యమం సైట్లపై ఉక్కుపాదం మోపాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ఉగ్రవాద సంస్థలు ఎప్పుడూ ఆధారపడే కొన్ని సైట్లపై నిషేధం విధించాలని ఆయన చెప్పారు. అయితే ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యను ఎవరూ సమర్థించరని ఆయన అంగీకరిస్తూనే, సురక్షిత, భద్రతతో కూడిన వాతావరణం నెలకొల్పడానికి తాత్కాలికంగానైనా ఎంపిక చేసిన సైట్లపై నిషేధం విధించక తప్పదన్నారు.