ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిరిండియాను విక్రయించడంపై సలహాలను, సూచనలను స్వీకరించడానికి సిద్ధం : అశోక్‌ గజపతి రాజు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 17, 2018, 04:13 PM

న్యూఢిల్లి : నష్టాల్లో కూరుకుపోయిన ఎయిరిండియా విమానయాన సంస్థను విక్రయిస్తామని, అయితే దీనిపై సలహాలను, సూచనలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతి రాజు చెప్పారు. ఎయిరిండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను నిలిపివేయాలని పార్లమెంటు ప్యానెల్‌ సిఫార్సు చేసే అవకాశం ఉందని వెలువడిన వార్తలపై అశోక్‌ గజపతి రాజు స్పందించారు. పార్లమెంబు సభ్యులు స్వేచ్ఛగా తమ సలహాలను ఇవ్వవచ్చు. ఎలాంటి సలహాలు, సూచనలు అందినా వాటిని పరిశీలిస్తాం. ఈ అంశంపై సిఫార్సులను, చర్చలను ఆహ్వానిస్తున్నామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com