ఢిల్లీ: పతంజలి ఉత్పత్తులు ఇక ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. స్వదేశీ మూమెంట్ సంస్థగా పలు గృహా అవసరాలు, ఆయుర్వేద మందులు, పానీయాలు ఉత్పత్తి చేస్తున్న పతంజలి ఇక నుంచి అమెజాన్, ఫ్లిఫ్కార్ట్ల్లో వస్తువులను అమ్మనుంది. ఈ మేరకు ఈ-కామర్స్ సంస్థలతో ఒప్పంది కుదుర్చుకున్నట్లు పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ ప్రకటించారు. తమ ఉత్పత్తులు పేటీఎం, బిగ్ బాస్కెట్, నెట్ మెడ్, షాప్ క్లూస్ వంటి సంస్థలలో కూడా దొరుకుతాయని వెల్లడించారు.