ఢిల్లీ: జస్టిస్ లోయా మృతి కేసుపై సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం సీల్డ్కవర్లో కేసుకు సంబంధించిన వివరాలు ధర్మాసనంకు అందించింది. పిటిషనర్కు కూడా ఆ వివరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. లోయా కేసు విచారణలో పారదర్శకత పాటించాలని సూచించింది. విచారణ వివరాలు అందరికీ తెలియాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.