విశాఖపట్టణం : రాజకీయ లబ్ధికోసం అసెంబ్లీని వాడుకోవద్దని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... అసెంబ్లీ సమావేశాలు 30 రోజుల పాటు నిర్వహించాలన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చలు జరగాలని అన్ని పార్టీలకు లేఖ రాస్తానన్నారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో మరోసారి తీర్మానం చేసి ప్రతిపక్షాలను ఢిల్లీ తీసుకెళ్లాలని రఘువీరా అన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం భయపడుతోందన్నారు. అమెరికాలో హత్యకు గురైన కూచిబొట్ల శ్రీనివాస్ మృతికి సంతాపం తెలుపుతున్నానన్నారు.