న్యూఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అత్యాచారానికి పాల్పడిన వారు ఆమె స్నేహితులేనని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 3వ తేదీన కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగింది. ఆ కార్యక్రమం పూర్తయిన తరువాత లిఫ్ట్ ఇస్తామంటూ బాధితురాలి స్నేహితులు గౌరవ్, సన్నీలు ఆమెను బైక్ పై తీసుకువెళ్లారు. ఆ బైక్ మరో స్నేహితుడు సచిన్ . గౌరవ్, సన్నీలు బాధితురాలిని ఫరీదాబాద్ లోని మరో స్నేహితుడు రోహతాష్ నివాసానికి తీసుకువెళ్లారు. అక్కడ గౌరవ్, సన్ని, సచిన్, రోహతాష్ లు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత ఆమెను వర్సిటీ వద్ద డ్రాప్ చేయడానికి కారులో తీసుకువెళ్లిన మరో స్నేహితుడు వినోద్ కూడా నిర్జన ప్రదేశంలో కారు నిలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంగతి ఎవరికైనా చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసిన తీవ్ర పరిణామాలు ఎదుర్కొనవలసి ఉంటుందని బెదరించారు. ఆమె ఫిర్యాదు మేరకు అత్యాచారానికి పాల్పడిన ఐదుగురితో పాటు వారికి సహకరించిన మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు.