ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు..ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ మార్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 06, 2022, 02:25 PM

ఏపీ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలకు రంగం సిద్దమైంది. ఈ నెల 19 నుంచి వర్షాకాల సమావేశాలను నిర్వహించబోతున్నట్లు సమాచారం. 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు సెషన్స్ నిర్వహించే అవకాశం ఉంది. ఈ సమావేశాల్లోనే డిప్యూటీ స్పీకర్ ను మార్చే అవకాశముందని తెలుస్తోంది. ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఆ మరుసటి రోజు నుంచే అసెంబ్లీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సెషన్స్‌లో కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.


ఇదిలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రమోషన్ ఇచ్చే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌ను మార్చే అవకాశం ఉందని కొద్దిరోజులగా ఊహాగానాలు వినిపిస్తుండగా.. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న కోన రఘుపతి స్థానంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిని ఎన్నుకునే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. స్వామి ఎంపిక వెనుక సామాజిక సమీకరణాలు ఉన్నాయంటున్నారు.


ఇటీవల మంత్రివర్గ విస్తరణలో వైశ్య సామాజిక వర్గం నుంచి ఎవరికీ అవకాశం దక్కలేదు. దీంతో వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. ఎప్పటి నుంచో కోలగట్ల పేరు వినిపిస్తున్నా.. ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. మరి ఈసారైనా పదవి దక్కుతుందా, లేదా అన్నది చూడాలి. దీనికి సంబంధించి అధికారికంగా పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com