హైదరాబాద్ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాల్లో శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రెండు రాష్ర్టాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటాపోటీ ఉంది. తొలి ఫలితం ఉదయం 11.30 గంటలకు వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది.