ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నౌకాయానంలో భారత్‌కు ఎంతో ప్రాధాన్యం : రాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 08, 2017, 10:52 AM

విశాఖ : ఐఎన్‌ఎస్ సర్కార్ మైదానంలో ప్రజెంటేషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ కలర్ టు సబ్‌మెరైన్ ఆర్మ్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. నౌకాదళంలోకి జలాంతర్గామి ప్రవేశించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ మాట్లాడుతూ.. నౌకాయానంలో భారత్‌కు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ నౌకాయాన రంగంపై ఆధారపడి ఉందని తెలిపారు. 90 శాతం వర్తకమంతా నౌకాయానం ద్వారానే జరుగుతుందని చెప్పారు. జలాంతర్గాముల విభాగం నౌకాదళంలో అత్యంత శక్తివంతమైందిగా ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు. నౌకాదళంలో 25 సబ్‌మెరైన్లు ఉన్నాయని తెలిపారు. శత్రు భయంకరంగా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరుతున్నానని రామ్‌నాథ్ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com