అమరావతి : హెరిటేజ్ సంస్థ టర్నోవర్ 2,600 కోట్ల రూపాయలని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఈ రోజిక్కడ ఆయన తన కుటుంబ ఆస్తులను ప్రకటించారు. 1992లో హెరిటేజ్ సంస్థను ప్రారంభించామన్నారు. మార్కెట్ విలువ ప్రకారం ఆస్తుల విలువ కూడా మారుతుంటుందన్నారు. తన తండ్రి నారా చంద్రబాబు ఆస్తులలలో ఎటువంటి మార్పూ లేదన్నారు. తన తండ్రి చంద్రబాబు ఆస్తులు రూ.37లక్షల రూపాయలు కాగా, అప్పులు 3.58 కోట్ల రూపాయలని లోకేష్ వెల్లడించారు. ఇక తన ఆస్తుల విలువ 15.20 కోట్ల రూపాయలని చెప్పారు. తన భార్య బ్రాహ్మణి ఆస్తుల విలువ 15 కోట్ల రూపాయలనీ, తన కుమారుడు దేవాన్ష్ ఆస్తుల విలువ 11.54 కోట్ల రూపాయలనీ లోకేష్ వెల్లడించారు.