ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ కొరతతో అనేక పరిశ్రమలు మూత పడ్డాయి: ఎమ్మెల్యే ఆంజనేయులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 28, 2017, 11:51 AM

కాంగ్రెస్‌ పరిపాలనలో కనీసం పేద ప్రజలకు కూడా ఉచిత విద్యుత్‌ ఇవ్వలేకపోయారని వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పరిపాలనలో చాలా అవినీతి జరిగిందని, అన్నిరంగాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పి గ్రామాల్లో 12గంటలు కరెంట్‌ కోత విధించారని చెప్పారు. కాంగ్రెస్‌ పాలనలో విద్యుత్‌ కొరతతో అనేక పరిశ్రమలు మూత పడ్డాయని, దీంతో లక్షలాది మంది నిరుద్యోగులైపోయారని ఆయన అన్నారు. నేడు చంద్రబాబు 24గంటలు విద్యుత్‌ను రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నారన్నారు. గతంలో 22 వేల యూనిట్ల విద్యుత్‌ లోటు ఉంటే దాన్ని అధిగమించి 24గంటల విద్యుత్‌, రైతులకు 7గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్న ఘనత చంద్రబాబుదేనన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే విద్యుత్‌ సమస్యలను పరిష్కరించిందన్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుండి, దేశాల నుండి అనేక పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాయన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com