అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన విట్ కళాశాల మంగళవారం ప్రారంభమైంది. కృష్ణా జిల్లా ఐనవోలు గ్రామ పరిధిలోని నిర్మించిన డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ అకడమిక్ బ్లాక్, సరోజినీ నాయుడు వసతిగృహం బ్లాకులను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ప్రముఖులు హాజరయ్యారు.