అగర్తలా: జర్నలిస్ట్ హత్యకు నిరసనగా త్రిపుర రాష్ట్రంలో అధిక సంఖ్యలో న్యూస్పేపర్లు తమ సంపాదకీయాన్ని ఖాళీగా విడిచిపెట్టాయి. రెండు రోజుల క్రితం జరిగిన జర్నలిస్ట్ సుదీప్ దత్తా భౌమిక్ హత్యకు నిరసనగా ఎడిటోరియల్ను ఖాళీగా వదిలి తమ నిరసనను వ్యక్తపరిచారు. అగర్తలాకు సమీపంలోని ఆర్కేనగర్లో త్రిపుర స్టేట్ రైఫిల్స్(టీఎస్ఆర్)కు చెందిన కమాండెంట్ను కలిసేందుకు వెళ్లిన జర్నలిస్టును అక్కడే విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కాల్చిచంపాడు. ప్రముఖ బెంగాలీ పత్రిక రిపోర్టర్ సుదీప్ దత్త భౌమిక్.. టీఎస్ఆర్ కమాండెంట్ను కలిసేందుకు వెళ్లాడు. అక్కడ ఉన్న కానిస్టేబుల్ అతన్ని అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా కానిస్టేబుల్, సుదీప్కి మధ్య చిన్న వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో జర్నలిస్ట్ ను కానిస్టేబుల్ తుపాకీతో కాల్చిచంపాడు.