చెన్నై: చెన్నై సత్యభామ యూనివర్సిటీలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థిని రాధమౌనిక హాస్టల్ గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాధమౌనిక ఆత్మహత్యకు ముందు తన స్నేహితులకు మిస్ యూ ఆల్ అంటూ మెసేజ్ పెట్టింది. అదే వర్సిటీలో చదువుతున్న సోదరుడుకి సైతం ఆత్మహత్యకు ముందు మౌనిక వీడియోకాల్ చేసింది. దీంతో స్పందించిన అమె సోదరుడు మౌనిక దగ్గరకు వెళ్లడానికి యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారని తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. రాధమౌనిక ఆత్మహత్యకు యాజమాన్యమే కారణమని తోటి విద్యార్థులు యూనివర్సిటీలో ఆందోళనలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం మౌనికను అధికారులు పరీక్ష హాల్ నుంచి బయటకు పంపారని, దీంతో మనస్థాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆరోపించారు. కాగా యాజమాన్యం మాత్రం మౌనిక ఇంటర్నల్ ఎగ్జామ్లో కాపీ కొట్టిందని ఆరోపిస్తోంది. జనవరి ఒకటి వరకు యూనివర్సిటీకి సెలవు ప్రకటించింది.