ఏపీ ప్రభుత్వ తాత్కాలిక సచివాలయంలో ఎమర్జన్సీ అలారం మోగడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. అలారం మోగడంతో రెండో బ్లాక్లో పనిచేస్తున్న ఉద్యోగులు కలవరపాటుకు గురయ్యారు. భయంతో బయటకు పరుగులు తీశారు. స్మోక్తో అలారం మోగిందని పోలీసులు నిర్ధారించారు. ఎవరో అక్కడ సిగరేట్ తాగడంతో వల్ల ఆలారం మోగిందని చెప్పడంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు.