స్పీకర్ స్థానం ఎంతో గౌరవమైందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. స్పీకర్పై వైసీపీ నేత అంబటి చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె సభా ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్పీకర్ కోడెల మాట్లాడుతూ… వ్యక్తిగత విమర్శలు చాలా బాధ కలిగించాయన్నారు. స్పీకర్ స్థానాన్ని కించపరచడం సబబు కాదన్నారు. అంబటి వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.