ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మద్దతుదారుడు పోసాని కృష్ణ మురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా జగన్పై ఆయన ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మాములోడు కాదని, దేవుడి ప్రసాదం లాంటి వాడని అన్నారు. దూరం నుంచి బ్రహ్మపదార్ధంలా కనిపించినా, దగ్గరి నుంచి మాత్రం దేవుడి ప్రసాదం అంత తీయగా ఉంటారన్నారుు. ప్రస్తుతం తాను సినిమాలలో బిజీగా ఉన్నానని, ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నానని పోసాని వెల్లడించారు. అంతే కాకుండా రెండు, మూడు టీవీ షోలు కూడా చేస్తున్నట్లు తెలిపారు.