అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున పొలంలో గొర్రె పిల్లల మందపై చిరుత దాడి చేయడంతో రమేష్, సుంకన్నకు చెందిన దాదాపు 30 గొర్రె పిల్లలు చనిపోయాయి. ఈ మధ్యకాలంలో చిరుత దాడిలో దాదాపు వందకు పైగా గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం కారణంగా గ్రామంలో ఎవరికి మనశ్శాంతి లేకుండా ఉందని. ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నామని గ్రామస్తులు తెలిపారు. చిరుత దాడిలో చనిపోయిన గొర్రెపిల్లలను అటవీశాఖ అధికారులు, సిబ్బంది అద్వర్యంలో పంచనామా చేశారు.