ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్ మెడికల్ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే లాలూను ఢిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు.
పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యం కారణంగా రాంఛీలోని రిమ్స్లో చేరారు. చాలా రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఢిల్లీలోని ఎయిమ్స్కు తరలించాలని సూచించారు.