ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరింత క్షీణించిన లాలూ ఆరోగ్యం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 04:17 PM

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు సమాచారం. ప్రస్తుతం రాంచీలోని రిమ్స్​లో ఆయన చికిత్స పొందుతున్నారు. అయితే ఆయనను మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే రిమ్స్​ మెడికల్​ బోర్డు సమావేశమై దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఆ తర్వాతే లాలూను ఢిల్లీ ఆస్పత్రికి తీసుకెళ్లనున్నారు.


పశువుల దాణ కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ అనారోగ్యం కారణంగా రాంఛీలోని రిమ్స్​లో చేరారు. చాలా రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్నారు. అయితే మంగళవారం ఉదయం ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనకు చికిత్స అందిస్తున్న వైద్యులు ఢిల్లీలోని ఎయిమ్స్​కు తరలించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com