ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఆ రెండు దేశాల వివాదంపై భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోంది. అయితే అమెరికా తన అక్కసునంతా భారత్పై వెళ్లగక్కింది. ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా మిత్ర దేశాల వైఖరి అంతా ఒకలా ఉంటే, భారత్ వైఖరి వేరేలా ఉందని జో బైడెన్ అన్నారు. వాషింగ్టన్లో సోమవారం నిర్వహించిన వ్యాపారవేత్తలతో సమావేశంలో అమెరికా అధ్యక్షుడు ఆ వ్యాఖ్యలు చేశారు. నాటో, యురోపియన్ యూనియన్, ఆసియా దేశాలు అన్నీ రష్యాకు వ్యతిరేకంగా ఉన్నట్లు బైెడెన్ చెప్పారు. క్వాడ్ గ్రూప్లోని ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్ దేశాలు రష్యా తీరును ఖండిస్తున్నాయని చెప్పారు. అయితే రష్యా నుంచి రాయితీపై ముడిచమురు కొనేందుకు భారత్ సిద్ధమవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో రష్యాపై పశ్చిమ దేశాలు, అమెరికా ఆంక్షలు కఠినంగా విధించాయి. ఈ తరుణంలో రష్యా విజ్ఞప్తి మేరకు ఆ దేశం నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసేందుకు అంగీకరించింది. రష్యా భారీ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు తరలింపులో ఇన్స్యూరెన్స్ కూడా భరిస్తామని చెప్పడంతో భారత్ సమ్మతించింది. దీంతో అమెరికా తరచూ భారత్పై ఇటీవల కాలంలో విమర్శలు ఎక్కుపెడుతోంది.