వల్లూరు మండల కేంద్రమైన వల్లూరులో కైలాస్ (25) ఆనే యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బట్వారా షేర్ కుటుంబంతో కలిసి కొన్నేళ్ల కిందట వల్లూరు వచ్చి నివాసం ఉంటున్నారు. అతని కుమారుడు కైలాస్ కొంతకాలంగా మానసికవ్యాధితో బాధపడుతూ కొంతకాలంగా చికిత్స పొందుతున్నాడు.
నిత్యం కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో సోమవారం వాగ్వాదం చేయడంతో కుటుంబ సభ్యులు ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. అంతలోనే కైలాస్ కత్తితో పొట్టలో పొడుచుకుని అక్కడికక్కడే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న గ్రామీణ సీఐ శ్రీరాం శ్రీనివాసులు, ఎస్.ఐ. విష్ణువర్ధన్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్త చేస్తున్నట్లు వారు తెలిపారు.