అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని పార్కుల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి కనబరుస్తున్నట్లు మునిసిపల్ కమిషనర్ వెంకటేశ్వర రావు తెలిపారు. పట్టణంలోని 10వ వార్డులోని పార్కును పరిశీలించారు. ఈ పార్కులో నిత్యం చిన్నారులతో మొదలుకుని వృద్ధుల వరకు వాకింగ్ చేయడం వ్యాయామం చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఇక్కడ పార్కులను మరింత అభివృద్ధిని చేయనున్నట్లు తెలిపారు. కమిషనర్ వెంట ఏ ఈ సురేష్, సర్వేయర్ సురేష్, వైసీపీ నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.