ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉక్రెయిన్‌లో 2వేలుపైగా చిన్నారులు కిడ్నాప్

international |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 09:32 PM

ఉక్రెయిన్‌పై పట్టు సాధించేందుకు రష్యా బలగాలు దాడులను ముమ్మరం చేస్తున్నాయి. కీలక నగరాల ప్రజలకు, పాలకులకు లొంగిపోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేస్తోంది. ఒప్పుకోని కొన్ని నగరాల్లోని మేయర్లను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారు. జనాభాను భయభ్రాంతులకు గురి చేసేందుకు రష్యా దాదాపు 2,389 మంది పిల్లలను కిడ్నాప్ చేసిందని ఉక్రెయిన్ ఆరోపించింది. సోమవారం ఆ దేశ విదేశాంగ శాఖ రష్యాపై సంచలన ఆరోపణలు చేసింది. రష్యా ఆక్రమిత డాన్‌బాస్ ప్రాంతంలో పరిస్థితిపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. దాదాపు 2000 మంది చిన్నారులు అదృశ్యమయ్యారని, వారిని రష్యా సైనికులు అపహరించినట్లు  అనుమానం వ్యక్తం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com