తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె.ఎస్. జయలలిత మృతిపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం కీలక వ్యాఖ్యలు చేశారు. జయలలితకు చికిత్స చేస్తున్నప్పుడు ఏం జరిగిందో తనకు తెలియదన్నారు. అప్పుడు సీసీ కెమెరాలు తొలగించిన విషయాన్ని తనకు చెప్పలేదు. అయితే మెరుగైన వైద్యం కోసం జయలలితను విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనిపై అప్పటి వైద్యారోగ్య శాఖ మంత్రి విజయ్కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్రావుతో చర్చించినా వారు స్పందించలేదు.అప్పట్లో ఆమె మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందని అంతా అనుమానిస్తున్నారు. రిటైర్డ్ జస్టిస్ ఆర్ముగం అధ్యక్షతన 2018లో విచారణ కమిషన్ ఏర్పాటైంది.