పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు కీలక అంశాలను లేవనెత్తారు. ఇందులో భాగంగా సోమవారం జరిగిన లోక్ సభ సమావేశాల్లో టీడీపీ సీనియర్ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నాని కీలక అంశాన్ని లేవనెత్తారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ హైవే నిర్మాణానికి విభజన చట్టంలోనే హామీ ఇచ్చారని కేశినేని గుర్తు చేశారు. విజయవాడ-హైదరాబాద్ మధ్య 65వ నెంబరు జాతీయ రహదారిని 6 లైన్ల రహదారిగా మళ్లించాలని డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద నుండి కృష్ణా నది పై వంతెన నిర్మించి అమరావతి వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు..