ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 7,364 కరోనా టెస్టులు నిర్వహించగా, 37 పాజిటివ్గా నిర్ధారణ అయ్యాయి. అనంతపురం జిల్లాలో 17, తూర్పుగోదావరి జిల్లాలో 10 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు, కడప, కృష్ణా, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కాలేదు. అదే సమయంలో 42 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఎటువంటి మరణాలు సంభవించలేదు.రాష్ట్రంలో ఇప్పటివరకు 23,19,267 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 23,04,031 మంది కోలుకున్నారు. మరో 506 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 14,730 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.