చెన్నైలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసును దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మార్చి 17న జరిగింది. రత్నా దేవి(58) అనే మహిళ మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ గా గుర్తించారు.
మహ్మద్ ఫైజల్ రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక మొబైల్స్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కరోనా సమయంలో నష్టపోయాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో చోరీల బాట పట్టాడు. ఫైజల్ స్వతహాగా బాడీ బిల్డర్. 2019 లో బాడీ బిల్డింగ్లో మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నాడు.