ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒకప్పుడు మిస్టర్ ఇండియా.. ఇప్పుడు చైన్‌ స్నాచర్‌

international |  Suryaa Desk  | Published : Mon, Mar 21, 2022, 05:05 PM

చెన్నైలో ఓ మహిళ మెడలో నుంచి గొలుసును దోచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మార్చి 17న జరిగింది. రత్నా దేవి(58) అనే మహిళ మెడలోని గొలుసును కొట్టేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్​ ఆధారంగా గుర్తించామని పోలీసులు తెలిపారు. నిందితుడిని చెన్నైలోని మన్నాడి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫైజల్ గా గుర్తించారు.


మహ్మద్ ఫైజల్ రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. చదువు పూర్తయ్యాక మొబైల్స్​ వ్యాపారాన్ని ప్రారంభించాడు. కరోనా సమయంలో నష్టపోయాడు. చేసిన అప్పులు తిరిగి చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. దీంతో చోరీల బాట పట్టాడు. ఫైజల్ స్వతహాగా బాడీ బిల్డర్. 2019 లో బాడీ బిల్డింగ్​లో మిస్టర్ ఇండియా టైటిల్​ గెలుచుకున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com