దేశవ్యాప్తంగా ప్రజలు శుక్రవారం హోలీ సంబరాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. రంగులు, నీరు, పువ్వులు ఒకరిపై ఒకరు చల్లుకుంటూ సంతోషంలో మునిగిపోయారు. గురువారం రాత్రి హోలికా దహనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పండుగకు గుర్తుగా రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ పండగ సంబరాలలో ప్రజలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం దేశప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ప్రతి రంగు ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. "మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. పరస్పర ప్రేమ, ఆప్యాయత మరియు సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ మీ జీవితంలో ప్రతి రంగు ఆనందాన్ని తీసుకురావాలి" అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ కూడా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.