దేశంలో...., ప్రత్యేకంగా చెప్పాలంటే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆడ వారి మీద హత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయ్. ప్రభుత్వం దిశా చట్టం అని తీసుకువచ్చినప్పటికీ , ఈ చట్టం వలన కానీ, ప్రభుత్వం వలన కానీ జరిగే ఘోరాలు ఆగడం వీలుకాలేదు అంటే నమ్మక తప్పదు. తాజాగా రేణిగుంట మండలం ,కరకంబాడి బీసీ కాలనీలో మత్యకార నిరుపేద కుటుంబానికి చెందిన 6సం బాలిక పై వైసిపి కార్యకర్త మునిరాజా అత్యాచారం చెయ్యడం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి జనసేన నాయకులూ(కోట వినూత ) అండగా నిలిచారు. బాలిక కుటుంబాన్ని పరామర్శించి వారికీ న్యాయం జరిగేలా చేస్తాం అని హామీ ఇచ్చారు.