కర్నూలు నగర శివారులోని భారత్ గ్యాస్ పరిశ్రమ వద్ద సోమవారం పెను ప్రమాదం తప్పింది. బెంగూళూరు నుంచి హైదరాబాదు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంగా దూసుకొచ్చింది. యూటర్న్ తీసుకుంటున్న లారీని తప్పించబోయి డ్రైవర్ ఎడమ వైపు తిప్పడంతో రెయిలింగ్ ను దాటి రోడ్డు పక్కకు వెళ్లి అక్కడ నిలిపి ఉంచిన గ్యాస్ ట్యాంకర్ను తగులుకుని ఆగింది. గ్యాస్ ట్యాంకర్ ఖాళీగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.