గుర్తుతెలియని వ్యక్తులు మిర్చి పంటను దగ్ధం చేసిన సంఘటన మండలంలోని పాకాలపాడులో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పెద గోపిరెడ్డి కి కల్లాల్లో ఆరబెట్టిన 30 క్వింటాళ్ల మిర్చి పంటను దుండగులు దగ్ధం చేశారు. దీంతో సుమారు లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయారు. దీనిపై సత్తెనపల్లి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.