తపాలా ఉద్యోగుల న్యాయపరమైన హక్కుల సాధనకై ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి తమ సత్తా చాటాలని తపాల ఉద్యోగుల సంఘం డివిజనల్ కార్యదర్శి శరత్ కుమార్ పిలుపునిచ్చారు. వరదయ్యపాలెం తపాలా కార్యాలయంలో అఖిలభారత తపాల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం కోరుతూ సమ్మె సన్నాహక సదస్సును ఉప తపాలా అధికారులు శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించారు.