లాడ్జికి తీసుకెళ్లి భార్యను భర్త చంపిన ఘటన ఆదివారం రాత్రి కంచికచర్ల అశోకా రెసిడెన్సి లాడ్జ్లో జరిగింది. నిన్న రాత్రి సుమారు 10 గంటలకు ప్రసాద్ (35) అనే వ్యక్తి తన భార్యతో కలిసి పాత బస్టాండ్ ఎదురుగా ఉన్న అశోకా రెసిడెన్సి లాడ్జ్ లో దిగాడు. అర్థరాత్రి 2 గంటల సమయంలో బయటికెళ్లి జ్యూస్ తీసుకొచ్చాడు. మళ్లీ లాడ్జి నుండి బయటికెళ్లిన ప్రసాద్ తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది అతని తీసుకున్న గది వద్దకు వెళ్లి చూడగా డోరు తాళం వేయలేదు. వెంటనే సదరు వ్యక్తికి ఫోన్ చేసి డోర్ తాళం వేయాల్సిందిగా సిబ్బంది తెలిపారు. బయటికి వెళ్ళాను.. ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. నిందితుడు నేరుగా కంచికచర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి తాను నందిగామకు చెందిన వ్యక్తినని, తన భార్యను లాడ్జిలో చంపినట్లు పోలీసులకు తెలిపి లంగిపోయాడు. నిందితుడి నుండి వివరాలు తీసుకొని పోలీసువారు గవర్నర్పేట పోలీసువారికి సమాచారమిచ్చారు. గవర్నర్పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.